సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలో డ్రగ్స్ అధికారులు దాడులు నిర్వహించి దుర్గ భవాని మెడికల్ షాప్ నిర్వకుడిని అరెస్టు చేశారు .వివరాల ప్రకారం మఠంపల్లి మండలంలోని దుర్గ భవాని మెడికల్ షాపులో నిషేధిత టానికులు విక్రయిస్తున్నారని సమాచారంతో మెడికల్ షాప్ పై ఎక్సైజ్ డ్రగ్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నిషేధిత టానిక్ లు స్థానికులకు విక్రహిస్తున్నట్లుగా తేలడంతో పాటు దాడులలో టానికులు మెడికల్ షాపుని సీజ్ చేసి మెడికల్ షాప్ నిర్వాహకుడు రూపవత్ రవీందర్ నాయక్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు .నిషేధిత మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం నిషేధిత మందులు టానిక్ లు మెడికల్ షాప్ నిర్వాహకులు విక్రయించి అధిక ధరలు తీసుకోవడంతో పాటు నిషేధించిన మందుల వాడకం వల్ల ప్రజల ఆరోగ్యాలకు హాని కలుగుతుందని అధికారులు అన్నారు.
-----------------------
Admin