Wednesday, 16 September 2026 01:03:02 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నేడు ఘంటసాల స్వరాభిషేక పాటల పోటీలు...

Date : 10 February 2024 10:26 AM Views : 358

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల 50వ వర్ధంతిని పురస్కరించుకొని నేడు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ ఉన్నత పాఠశాలలో జరుగు ఘంటసాల పాటల పోటీలను విజయవంతం చేయాలని శ్రీ జ్ఞాన సరస్వతి సాంస్కృతిక కళావేదిక అధ్యక్ష కార్యదర్శులు బుర్రి వెంకటేశ్వర్లు గుండా రమేష్ లు తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పి నాగభూషణంకు ఈనెల 11న ఘంటసాల వర్ధంతి సందర్భంగా జరుగు స్వరాభిషేకంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ పాటల పోటీల్లో గెలుపొందిన వారికి రెండు విభాగాల్లో ప్రధమ బహుమతిగా రూ .2500 నగదు, ద్వితీయ బహుమతిగా రూ.1500 నగదు తృతీయ బహుమతిగా రూ.1000 రూపాయల నగదుతో పాటు ప్రశంసా పత్రములు ఈ నెల 11 ఘంటసాల వర్ధంతి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు బాలాజీ బాంకెట్ హాల్లో జరుగు స్వరాభిషేకం కార్యక్రమంలో అందజేస్తామని తెలిపారు. పాటల పోటీలకు న్యాయ నిర్ణేతలు గా పాడుతా తీయగా విశ్లేషకులు టి రాజా బాబు సాహితీ వేత్త కె వి ఎస్ కుమార్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కల్లూరి నాగయ్య లు వ్యవహరిస్తారని తెలిపారు. సంగీత ప్రియులు ఈ పాటలో పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నక్క శ్రీనివాస్ కార్యనిర్వాహక సహాయకులు గోపారపు రాజు, బచ్చు పురుషోత్తం పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :