Wednesday, 29 July 2026 09:52:42 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మఖ్తల్ లో ప్రెస్ క్లబ్ భవనానికి స్థలం, నిధులు కేటాయించాలి ... - టీయూడబ్లూజే హెచ్ 143 యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మామిళ్ల పృథ్వీరాజ్

Date : 31 July 2023 09:15 AM Views : 460

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మఖ్తల్ నియోజకవర్గ కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవనానికి స్థలం కేటాయించడంతోపాటు భవన నిర్మాణానికి అవసరమైన నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని టీయూడబ్లూజే హెచ్ 143 యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మామిళ్ల పృథ్వీరాజ్ , మఖ్తల్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం సమావేశంలో మాట్లాడుతూ, నియోజకవర్గ కేంద్రమైన మఖ్తల్ లో ప్రెస్ క్లబ్ భవనం కోసం గత కొన్నేళ్ల నుంచి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు డిమాండ్ చేస్తున్నారని, ఇప్పటివరకు మఖ్తల్ లో ప్రెస్ క్లబ్ భవనం లేకపోవడం శోచనీయమన్నారు. గత రెండు మూడు రోజుల కిందట షాద్ నగర్ నియోజకవర్గంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణాల కోసం 2 కోట్ల 30 లక్షల నిధులు మంజూరు చేశారని గుర్తుచేశారు. షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం 50 లక్షలు, అదే నియోజకవర్గంలోని ఆరు మండల కేంద్రాల్లో ప్రెస్ క్లబ్ భవనాల నిర్మాణం కోసం తలా 30 లక్షలు కలిపి మొత్తం 2 కోట్ల 30 లక్షల నిధులు మంజూరు చేశారని అన్నారు. మఖ్తల్ నియోజకవర్గ కేంద్రమైన మఖ్తల్ పట్టణంలో ప్రెస్ క్లబ్ భవనం కోసం స్థలంతోపాటు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్తుల పాత్ర ఎనలేనిదని, 2014కు ముందు ఎన్నికల్లో ఉద్యమనేత కేసీఆర్ జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు. సమావేశంలో జర్నలిస్ట్ కార్తీక్ పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :