సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం మంత్రి పువ్వాడకు కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు నోటీసు... కోర్టు ధిక్కరణ కేసులో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరుకు హైకోర్టు ఆదేశాలిస్తూ శుక్రవారం ఫామ్ -1 నోటీసులు జారీ చేసింది ఖమ్మం నగరంలోని మమతా మెడికల్ కాలేజీ చైర్మన్ హోదాలో పువ్వాడకు నోటీసు ఇచ్చారు పీజీ కోర్సులకు 2017 జీవో ప్రకారం పెంచిన ఫీజులు వసూలు చేసినందుకు నోటీసు జారీ చేశారు పాత ఫీజులే తీసుకోవాలని గతేడాది హైకోర్టు ఆదేశించినట్లు వెల్లడించింది వసూలు చేసిన అధిక ఫీజు విద్యార్థులకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది మమతా కాలేజీ తమకు ఫీజు తిరిగి ఇవ్వడం లేదని బాధితులు ధిక్కరణ పిటిషన్ దాఖలు వేయడంతో పువ్వాడ అజయ్ కు నోటీసు జారీ చేశారు కేసు వివరణ ఏప్రిల్ 17 కి వాయిదా పడింది.
-----------------------
Admin