సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన డిఎస్పీల సాధారణ బదిలీలలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి గా పనిచేస్తున్న శ్రీమతి నాగుల రమ్య ఎసిబి డిఎస్పీగా బదిలీ కావడం జరిగింది. ఈ సందర్భంగా సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి లోని జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ సింగ్ ఐపీఎస్ మరియు జిల్లా అదనపు ఎస్పీ కేవీ రామకృష్ణ ప్రసాద్ మరియు ఇతర సబ్ డివిజనల్ పోలీసు అధికారులు మరియు జిల్లాలోని వివిధ సర్కిల్ సిఐలు, ఎస్ఐ ల ఆధ్వర్యంలో శ్రీమతి రమ్య గారికి ఆత్మీయ వీడ్కోలు సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీమతి డిఎస్పి శ్రీమతి రమ్య మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎన్ని రోజులు తమకు సహాయ సహకారాలు అందించిన జిల్లా ప్రజలకు మరియు జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు మరియు ఇతర పోలీసు సిబ్బందికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ , విధి నిర్వహాణ ఇక్కడ పని చేసిన కాలం లో ఎంతో ఆత్మ సంతృప్తిని ఇచ్చిందని తెలియజేశారు. ఈ సందర్భంగా మేడం పరిది లో పని చేసిన అధికారులు అందరూ కూడా మేడం తో విది నిర్వహణ లో వారి అనుభవాలను నెమరు వేసుకున్నారు. అనంతరం ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ సింగ్ ఐపీఎస్ మరియు అదనపు ఎస్పి కేవీ రామకృష్ణ ప్రసాద్ ఇద్దరు స్వయంగా శ్రీమతి రమ్య గారి వాహనం దగ్గరకి వచ్చి వీడ్కోలు పలికారు.పెనుకొండ సబ్ డివిజనల్ అధికారి గా శ్రీమతి రమ్య స్థానంలో హుస్సేన్ పీరా ని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం మనందరికీ తెలిసిందే.
-----------------------
Admin