సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : అమడగూరు మండలం లో పశ్చిమ రాయలసీమ పట్టబద్రుల తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచార భాగంగా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆదేశాల మేరకు పలు గ్రామాలలో పశ్చిమ రాయలసీమ పట్టబద్రుల తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గేలుపే లక్ష్యంగా ముమ్మర ప్రచారం చేపట్టారు.జగన్ రెడ్డి నిరుద్యోగులను నట్టేట ముంచడని,ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు పడక అవస్థలు పడుతున్నారని,జాబ్ క్యాలెండర్ ఇస్తామంటూ కాలయాపన చేస్తున్నాడని ధ్వజమెత్తారు.పట్టభద్రులు, ఉద్యోగస్తులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కి మద్దతుగా నిలిచి ఓటు వేసి ఈ అరాచక ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని పలువురు ఓటర్లను కోరారు. ఈ సైకో ప్రభుత్వం పోవాలంటే మన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. ఈ కార్యక్రమంలో టి.యన్.యస్.యఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామాంజూలు నాయుడు,తెలుగు యువత భాస్కర్,బి.సి సెల్ ఉపాధ్యక్షులు వెంకటేష్,బూత్ కన్వీనర్ ఆనంద్, టి.యన్.యస్.యఫ్ నాయకులు మారుతి ప్రసాద్, ఆంజనేయులు, ఉపేంద్ర ,తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin