Thursday, 30 July 2026 04:22:32 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ అధికారులను ఆదేశించారు....

Date : 18 October 2022 12:02 AM Views : 595

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి కలెక్టరేట్లో నీ స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు తిరిగి రీ ఓపెన్  కాకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్  అర్జీలను స్వీకరించారు. స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో 219 అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించడం జరిగింది. జిల్లా కలెక్టర్ తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో,డిఆర్వో  పి కొండయ్య,  పుట్టపర్తి ఆర్డిఓ భాగ్య రేఖవివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఆయా మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రజా సమస్యల పరిష్కారంనికి శ్రీకారం చుట్టిందన్నారు.  రీ ఓపెన్ క్యాటగిరిలో మళ్లీ అర్జీలు మళ్లీ రాకుండా నాణ్యమైన పరిష్కారం చూపించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. స్పందన గ్రీవెన్స్ అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని, సకాలంలో అర్జీలను పరిష్కరించాలన్నారు. అర్జీలను పరిష్కరించడంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు.   తాడిమర్రి మండలం చిన్న చిగుళ్ల రేవు పంచాయితీ మర్రిమాకుల పల్లి వాసులు చత్రపతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ బాధితుల సమస్యలను పరిష్కరించే దిశగా వాస్తవ విషయాలపై విచారణ జరిపి పదిహేను రోజుల్లోపు నివేదిక ఇవ్వాలని  ధర్మవరం  ఆర్ డి ఓ ను ఆదేశించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :