సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం దేశాయిపల్లి గ్రామంలో నిరుపయోగకరంగా ఉన్నటువంటి 20 ఎకరాల భూమి ఏరువాక కేంద్రం కోసం నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు తో కలిసి పరిశీలించారు.దుగ్గొండి ప్రాంతంలోని రైతులకు వ్యవసాయం పట్ల పూర్తి అవగాహన కల్పించడం కోసం ఏరువాక కేంద్రం ఏర్పాటు చేయడం జరుగు తుందని,ఈ ఏరువాక కేంద్రంలో సైంటిస్టులు మరియు వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండి రైతులకు సూచనలు సలహాలు ఇవ్వడానికి కృషి చేస్తారని తెలిపారు.వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా రైతులకు వ్యవసాయంలో సమస్యలు ఏర్పడుతున్నందున వ్యవసాయ సమస్యల నివృత్తి & మెలకువల కోసం ఏరువాక కేంద్రం దోహదం చేస్తుందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు.ఈ ఏరువాక కేంద్రానికి భూమి అవసరమైతే ఎమ్మెల్యే సీడీఎఫ్ నిధులనుండి కొనుగోలు చేసి ఇస్తామన్నారు.కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు భూమ్ పెళ్లి దేవేందర్ రావు,మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి,దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష,క్లస్టర్ ఇంచార్జ్ ఓలిగే నర్సింగరావు,తో పాటు గ్రామ సర్పంచ్ ఉత్తరేణి భాగ్యలక్ష్మి రాజబాబు,బిక్కాజిపల్లి సర్పంచ్ బండారి రమేష్ నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ హింగే రామారావు,అజ్మీరా దంజ్య నాయక్,కాంగ్రెస్ మండల నాయకులు బండారి ప్రకాష్,కాంగ్రెస్ యువజన నాయకులు సుమంత్,కాంగ్రెస్ సినీయర్ నాయకులు ముత్యాల కుమారస్వామి,నాచినపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు స్వామి,మండలంలోని సర్పంచ్ లు,రైతులు తదితరులు హాజరయ్యారు.
-----------------------
Reporter