సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలంలో మిట్ట పల్లి బాలుర వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ . 17మంది విద్యార్థులకు అస్వస్థత . వాయిస్ ఓవర్ : శ్రీ సత్య సాయి జిల్లా ఓబులదేవర చెరువు మండలం మిట్టపల్లి ప్రభుత్వ బాలుర వసతి గృహంలో 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు . గమనించిన ప్రధానోపాధ్యాయులు మరియు టీచర్లు, CRP కేశవ ,స్థానికుల సాయంతో విద్యార్థులను కదిరి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . వసతి గృహంలో దాదాపు 120మంది విద్యార్థులు ఉండి చదువుకుంటున్నారు . ప్రతిరోజు లాగే కాలకృత్యాలు ముగించుకుని అల్పాహారం తినేందుకు రెడీ అయ్యారు . హాస్టల్ లో వంట మాస్టర్ గా పనిచేస్తున్న శ్రీనివాసులు కుమార్తె పుట్టినరోజు కావడంతో ప్రత్యేకంగా చేయించిన కేసరిబాత్ ను విద్యార్థులకు వడ్డించారు . అది తిన్న కొద్దిసేపటికే విద్యార్థులకు ముగ్గురికి వాంతులు కడుపు రావడం తో ప్రధానోపాధ్యాయులు, టీచర్ లు,CRP కేశవ అప్రమత్తమయ్యారు . వెంటనే 108 కు సమాచారం అందించి అస్వస్థతకు గురైన 17 మంది స్థానికుల సాయంతో విద్యార్థులందరినీ కదిరి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . మిగిలిన 30 విద్యార్థులకు ఓబుల దేవర చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కదిరి ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా మరియు మిట్టపల్లి ప్రభుత హాస్టల్ (2)ధర్నా చేసినAiSF జిల్లా విద్యార్థి సంఘ నాయకులు రాజేంద్రప్రసాద్ AiSF విద్యార్థుల సంఘ నాయకులు ప్రభుత్వ హాస్టల్ వార్డెన్ మెనూ ప్రకారంగా పెట్టడం లేదని అతని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు అక్కడ చేరుకున్న ఆర్డీవో రాఘవేంద్ర మిట్టపల్లి హాస్టల్ వార్డెన్ పై విచారణ జరిపి తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది.
-----------------------
Admin