Thursday, 30 July 2026 09:23:34 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ లో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ర్యాలీ...

Date : 01 June 2023 08:39 AM Views : 499

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ మండల ఆఫీసు పరిధిలో ప్రపంచ పొగాకు వ్యతిరేక వ్యతిరేక దినోత్సవం ర్యాలీ షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ... జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం లో భాగంగా ఈ సంవత్సరము పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మాకు ఆహారం కావాలి పొగాకు కాదు, అనే సూక్తితో ర్యాలీ నిర్వహించడం జరిగింది. పొగాకును వివిధ రకాల ప్రాడెక్టుల ద్వారా మానవులు ఉపయోగించడం వల్ల అనేక రకమైన జబ్బులకు, ప్రాణాంతకమైన వ్యాధులకు గురి అవుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు అని అన్నారు. అందువలన అందరూ కూడా సిగరెట్స్ తాగడం, జర్దాలు తినడం, పాన్ పరాకులు వేసుకోవడం, బీడీలు తాగడం మానేయాలని తెలిపారు. షాద్ నగర్ వైద్య ఆరోగ్యశాఖ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఎస్ జయలక్ష్మి మాట్లాడుతూ.. పొగాకు ప్రోడక్ట్లతో తయారుచేసిన బీడీలు, సిగరెట్లు, జర్దాలు, గుట్కాలు వాడటం వలన నోటి క్యాన్సర్లు, నోటి పుండ్లు ఏర్పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది అని చెప్పారు. అందువలన ఎవ్వరు కూడా పొగాకు సంబంధించిన ప్రొడక్ట్స్ వాడకూడదని నినాదాలు చేసుకుంటూ, మాకు పొగాకు కాదు ఆహారం కావాలి, అనే సూక్తితో, ప్లే కార్డ్స్ డిస్ప్లే చేస్తూ, ర్యాలీ తీయడం జరిగింది. అందరూ కూడా మంచి ఆహారము అలపాట్లు నేర్చుకొని తాజా కూరగాయలు పండ్లు, పాలు, పెరుగు ఆకుకూరలతో మంచి భోజనం తీసుకున్నట్లయితే ఆరోగ్యాన్ని పెంపొందించుకొని, ఆరోగ్యవంతమైన జీవనం గడపాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వినయ్ కుమార్, హెల్త్ ఎడ్యుకేటెడ్ జె శ్రీనివాసులు, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, హెల్త్ సూపర్వైజర్లు, ఎంపీహెచ్వోలు, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :