సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం ఓబులరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఒక యువతి స్నానపు గదిలో స్నానం చేయుచుండగా అదే గ్రామానికి చెందిన పట్నం శ్రీనివాసులు అనే వ్యక్తి స్నానపు గదిలోకి ప్రవేశించి తలుపు వేసి ఆమె శీలానికి భంగం కలిగించే విషయమై అప్పటి ఎస్సై ఎన్ రాజశేఖర్ రెడ్డి కేసు నమోదు చేశారు. కదిరి జుడీసీఎల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ (జడ్జి )కుమారి ప్రతిమ ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు 2000 రూపాయల జరిమానా విధించారు. ఈ కేసు నందు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసిన ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి ని మరియు శిక్షపడేలా విచారణ జరిపించిన ఇప్పటి ఎస్సై గోపి మరియు కోర్ట్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్ రెడ్డి ను జిల్లా ఎస్పీ అభినందించారు.కేసు విచారణ జరిపిన అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ప్రభుత్వ న్యాయవాది) ఖాదర్బాషా మరియు ప్రస్తుత ఏపీ లక్ష్మీ సాయి రామకృష్ణ లను ఎస్పీ అభినందించారు....
-----------------------
Admin