సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం పట్టణంలోని గాజుల రాజ్యం బస్తి లో ఫిబ్రవరి 25 తేదీన అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. బస్తి వాసులకు సైబర్ క్రైమ్ పైన అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్ ఎన్ని విధాలుగా జరుగుతుంది అనేదానిపైన సుమారు 30 నిమిషాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ అకౌంట్లో నుండి డబ్బు ఎన్ని విధాలుగా మాయమైపోతుందో తెలియజేశారు. అలాగే ఎవరైనా ఫోన్ చేసి ఓటిపి అడిగినా లేదా లింకు పంపించిన ఎవరు దానిపైన స్పందించవద్దని తెలియజేశారు. అలాగే మహిళా మణులకు తమ పిల్లల పైన నిఘా ఉంచాలని ప్రభుత్వ నిషేధిత గంజాయి అమ్మకం కొనుగోలు బస్తీలో ఎక్కడ జరిగిన తమకు తెలియజేయాలని సూచించారు. అలాగే ఈ మధ్యకాలంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న కారణంగా బస్తీలోనే యువకులు అప్రమత్తంగా ఉండాలని అలాగే స్త్రీలు దొంగలతో ఏ విధంగా వ్యవహరించాలి దొంగలు ఎదురైనప్పుడు భయపడకూడదని అవసరమైతే వారి పైన దాడి చేయండి అని అన్నారు. ఈ విషయాలలో పోలీస్ వారికి సహకరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యస్.ఐ.జి డానియల్ ప్రభుదాస్, ఏ.యస్.ఐ. జి మస్తాన్, కానిస్టేబుల్ కే.పి రావు, సలీమ్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin