సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నిబంధనకు విరుద్ధంగా అక్రమంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాల సీజ్ చేయాలి అని పాఠశాల ముందు, కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి పట్టుకున్న పాఠ్యపుస్తకాలతో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం పిడిఎఫ్ యూ,ఎస్ ఎఫ్ ఐ, ఏఐఎస్ఎఫ్ సూర్యాపేట జిల్లా కమిటీల ఆధ్వర్యంలో అందజేశారు .అనంతరం పి డి ఎస్ యూ జిల్లా అధ్యక్షుడు పోలేబొయిన కిరణ్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి ధనియాకుల శ్రీకాంత్ వర్మ, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు గోపగాని రవి లు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రం లో శ్రీ చెత్యన పాఠశాల అక్రమంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతుంటే పట్టించుకోకుండా కార్పొరేట్ విద్యా సంస్థలకు సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారులు కొమ్ముగాస్తున్నారు అని అన్నారు . ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నాలుగు వేల నుంచి 12 వేల వరకు పాఠ్య పుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజుల దోపిడీ చేస్తున్న, పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న అధికారాలు పట్టించుకోపోవడం సిగ్గు మాలిన చర్య అని అన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు స్కూల్ ఫిజుల పేరుతో లక్షల రూపాయలు కాకుండా టైం, బెల్ట్, పరీక్షల ఫీజుల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్న జిల్లా విద్యాధికారి ఎక్కడ కూడా తనిఖీ చేయకుండా స్పందించకుండా, చర్యలు తీసుకోకపోవడం వల్లనే కార్పొరేట్ శ్రీ చెత్యన పాఠశాల తన ఇష్టానుసారంగా పాఠ్యపుస్తకాలను అక్రమంగా అమ్ముతుందని అన్నారు .పాఠ్య పుస్తకాలు పట్టుకొని గుర్తు చేసినా కూడా విద్యాధికారులు పట్టించుకోకపోవడం అంటే శ్రీ చైతన్య కుక్క బిస్కెట్లకు కక్కుర్తి పడి అవినీతికి పాల్పడుతున్నారు. శ్రీ చైతన్య పాఠశాల ను సీజ్ చేసి, యాజమాన్యం పై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ పాఠశాలను సీజ్ చేయమని డిఈఓ కి చెప్పడం జరిగింది.తక్షణమే డిఇఓ గారు పాఠశాలలను సీజ్ చేయాలి లేని ఎడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమం లో వినయ్, ప్రవీణ్, వంశీ, మహేష్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin