సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని షాద్ నగర్ పట్టణ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. గురువారం నాడు షాద్ నగర్ మున్సిపాలిటీ 13వ వార్డులో ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అందత్వ రహిత తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. పెద్ద ఆసుపత్రులకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకోలేని నిరుపేదలకు కంటి వెలుగు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సహకారంతో పట్టణంలోని వార్డులలో కంటి వెలుగు వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు నడికూడ యాదగిరి యాదవ్, నందకిశోర్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin