సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మహిళా జర్నలస్టు తులసి చందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని మఠంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వస్కుల రామయ్య అన్నారు. మఠం పల్లి ప్రెస్ క్లబ్ కార్యాలయంలో అధ్యక్షులు మాట్లాడుతూ ప్రజల పక్షంగా ఉండి తన జర్నలిజం వృత్తిని ఆధారం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న జర్నలిస్టు తులసి చెందును కొంతమంది మతోన్మాద శక్తులు ఇష్టానుసారంగా దుర్భాషలాడటం మహిళా సమాజాన్ని కించపరచడం, భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాయటం అవుతుందని అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె ఉన్న వాస్తవాలను సమాజం దృష్టికి తీసుకువచ్చినప్పుడు అందులో పొరపాట్లు ఉంటే అందుకు తగిన విధంగా స్పందించాలి కానీ మహిళా జర్నలిస్టును పట్టుకొని నానారకాల దుర్భాషలాడటం బండ బూతులు తిట్టడం పలు రకాలుగా ఇబ్బందులు పెట్టడం మానవత్వం అనిపించుకోదని మహిళలను గౌరవించాలని మంచి సంప్రదాయం భారతదేశంలో ఉండగా ఒక విలువైన జర్నలిజంలో ఉన్నటువంటి మహిళ సోదరిని తన సోదరిగా భావించి సహకరించేది పోయి ఆమెను మానసికంగా వేదనకు గురిచేయడం సిగ్గుచేటు అని జర్నలిస్టు తులసి చెందుకు మానవత్వం ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు అండగా నిలవాలని అదేవిధంగా జర్నలిజం సమాజం తులసి చందుకు అండగా ఉంటుందని తులసి చందు ధైర్యంగా ఉండి జర్నలిజంలో వస్తున్న అవరోధాలను ఎదిరించాలని అందరికీ ఆదర్శప్రాయంగా విరోధులకు చెంపపెట్టుగా తన జర్నలిజం వృత్తిని కొనసాగించాలని తెలిపారు. ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు పోలీసులు ప్రజలు జర్నలిస్టు మిత్రులు ప్రతి ఒక్కరూ తులసి చందు కు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాండు నాయక్, రవీందర్ నాయక్, శివారెడ్డి, చిలక సైదులు, సుధాకర్,శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin