సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : జిల్లాలోని మైనారిటీ గురుకులాల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు చెందిన ఈపీఎఫ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా సోమవారం నాడు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి సంజీవరావును కోరారు. గాడ్స్ మేనేజ్ మెంట్ సర్వీసెస్, ఎర్త్ సెక్యూరిటీ అండ్ కాంట్రాక్ట్ మ్యాన్ పవర్ సర్వీసెస్ కు చెందిన ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు 2016-19లో మైనారిటీ గురుకులాల్లో పని చేస్తున్న బోదన, బోదనేతర ఉద్యోగులకు చెందిన ఈపీఎప్ బకాయిలు సుమారు 40 లక్షలు వారి ఖాతాలో జమ చేయనందున ఈ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై గతంలో కేసులు నమోదు చేయటం జరిగిందని, అనంతరం ఈ ఏజెన్సీ వారు ఉద్యోగులకు చెల్లించాల్సిన ఈపీఎఫ్ నిధుల బకాయిలను మైనారిటీ గురుకులాల కార్యదర్శికి, జిల్లా మైనారిటీ సంక్షేమ ఆధికారికి అందజేయటం జరిగిందని కాని నేటి వరకు ఆ నిధులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందలేదని, కావున వెంటనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు చెందిన 40 లక్షలను విడుదలచేయాలని కోరుతూ మైనారిటీ గురుకుల కార్యదర్శికి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారికి వినతిపత్రాలు అందజేసినట్లు యాకూబ్ పాషా విలేకరులకు తెలిపారు. ఫొటో : మైనారిటీ అధికారికి వినతిపత్రం అందిస్తున్న యాకూబ్ పాషా
-----------------------
Admin