సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణానికి చెందిన చింతకాయల వెంకన్న సోమవారం మధ్యాహ్నం సమయంలో పట్టణంలోని ఇందిరా చౌరస్తా నుండి సుందరయ్య నగర్ కాలానికి నడ్చుకుంటు వస్తుండగా క్రేన్ తాకి మృతి చెందాడు.డ్రైవర్ చేకూరి రాజేష్ క్రేన్ నడుపుతూ వాహనాన్ని, అతివేగంగా అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా నడుపుకుంటూ వచ్చి వెనుక నుండి బలంగా తాకివ్వడంతో కడుపులో బలమైన గాయాలు తగిలాయి.కాగా మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ హాస్పటల్ కు తీసుకెళ్లినప్పటికి ఫలితం లేకుండా మరణించాడని మృతిని భామ్మర్ధి ములకలపల్లి రాంగోపి పోలీసులకు పిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ జి.ముత్తయ్య ఒక ప్రకటనలో తెలిపారు...
-----------------------
Admin