సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సారపాక : ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలలో స్థానిక సారపాక బ్రిలియంట్ కాలేజ్ విద్యార్థులు కార్పొరేట్ కు ధీటుగా మరొకసారి రాష్ట్రస్థాయి మార్కులతో 100% ఫలితాలతో తమ సత్తా చాటారు విద్యార్థులందరూ 450/470 కి పైగా మార్కులు సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు .ఈ సందర్బంగా నిర్వహించిన కార్యక్రమం లో అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను పుష్ప గుచ్చాలిచ్చి స్వీట్లు పంచి బ్రిలియంట్ విద్యా సంస్థల చైర్మన్ బి యన్ ఆర్ అభినందించారు. Ch.మానస 462/470, D. శుస్రిత రెడ్డి 460/470, B. ఆదిత్యా నాయక్ 457/470 మార్కులు సాధించి ముందంజలో నిలిచారు. ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యా సంస్థ ల చైర్మన్ బి ఎన్ ఆర్ మాట్లాడుతూ ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో కూడా స్టేట్ మార్కులు సాధించి జిల్లాకే తలమానికంగా బ్రిలియంట్ జూనియర్ కాలేజ్ నిలిచేలా చేయాలని బ్రిలియంట్ కాలేజీ కు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ బి ఎన్ఆర్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
-----------------------
Admin