సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ నియోజకవర్గంలోని పిప్రి గ్రామానికి చెందిన ఎస్ రమేష్ రెడ్డి గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం అందించాలని అతడి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ఆశన్న జీవన్ రెడ్డి ని ఆశ్రయించారు. వెంటనే ఆయన సీఎం ఆర్ ఎఫ్ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి రెండు లక్షల రూపాయల ఎల్ వో సీని మంజూరు చేయించారు. ఎమ్మెల్యే బుధవారం మినిస్టర్స్ క్వార్టర్స్ లో గల తన నివాసంలో ఎల్ వో సీ చెక్కును అందజేశారు. రమేష్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న అభాగ్యులకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆసరాగా నిలుస్తున్నారని, రాష్ట్రంలో ఎల్వోసీల ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకుంటున్నారని బాధితులు కొనియాడారు.. కాగా ఎల్ వో సీ మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు , వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కు బాధితుల తరఫు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిప్రి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపిటిసి సురేష్, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin