సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : గత జులై నెల 29 తేదీన శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నందు హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యo కారణాలతో మరణించిన హోంగార్డు సి.మధు HG- 52 వయసు (56) కుటుంబానికి జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దెవ్ సింగ్ ఐపీఎస్ జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఆర్ధిక సహాయం అందజేశారు. గత కొన్ని రోజులు క్రితం మృతుడి కుమారుడైనటువంటి సి. శ్రీనాథ్ కు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ సింగ్ ఐపీఎస్ గారు హోంగార్డు గా నియామక ఉత్తర్వులు జారీ చేసి అందచేశారు. హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా చిన్న బిన్నం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎటువంటి పరిస్థితులైన హోంగార్డు కుటుంబాలకు పోలీసు వ్యవస్థ అండగా ఉంటుందని ఎస్పీ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పి తో పాటు అదనపు ఎస్పీ కేవీ రామకృష్ణ ప్రసాద్ , జిల్లా హోంగార్డు RI శ్రీశైలం రెడ్డి , ARSI శ్రీరాములు , ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు...
-----------------------
Admin