సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు,పూర్వికులు తెలుగు భాషలోని మాధుర్యం, గొప్పదనం ఇక ఏ భాషలోనూ లేదని ఎందరో కవులు కీర్తించారని రెవెన్యూ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు, గురువారం గచ్చిబౌలి స్టేడియంలో ప్రపంచ తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు, తేనెలొలుకు భాష.. మన తెలుగు భాష.. అమ్మదనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష.. అయితే, క్రమంగా వస్తున్న మార్పులతో తెలుగు భాష కనుమరుగు అవుతుందేమోనని ఆందోళన వ్యక్తం అవుతుంది.. ఇతర భాషలపై మమకారంతో తెలుగు భాషకు దూరం అవుతున్నారని గుర్తించిన ప్రభుత్వాలు.. స్కూళ్లను తెలుగు పాఠ్యాంశాన్ని తప్పనిసరిగా భోదించాలని నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. మరోవైపు. ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష చట్టం ద్వారా 1966లో తెలుగును రాష్ట్ర అధికారిక భాషగా ప్రకటించింది.. తెలుగు భాషా దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఆగస్టు 29న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో జరుపుకుంటారు,ఈ తేదీని తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జన్మదినోత్సవం.. గ్రాంధిక భాషలో ఉండే పాఠ్యాంశాలను వాడుక భాషలోకి మార్చాలని ఎంతగానో కృషిచేసిన వ్యక్తి గిడుగు వెంకట రమమూర్తి పంతులు.. తెలుగు భాషాభివృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు అందజేసి అవార్డులను కూడా అందజేస్తూ వస్తున్న విషయం విదితమే. మరోవైపు తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు. బిజెపి మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
-----------------------
Admin