సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలోని భారతీయ జనతా పార్టీ పట్టణ సీనియర్ నాయకులు పోసాని రాములు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వము ప్రకటించిన బీసీ కార్పొరేషన్ రుణాలు ప్రకటించిన మాట ఏమాయే జనవరి 8 వ తేదీ నుండి 16వ తేదీ వరకు బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలను బీసీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 52 రకాల ఉపాధి యూనిట్లు మంజూరు చేసింది. గత ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయలేదని, కూటమి ప్రభుత్వము బీసీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేసిందని ప్రజలందరూ సంతోషపడుతున్న సమయంలో కానీ ఇప్పటివరకు కూడా వెబ్సైట్లో ఇప్పటివరకు ఓపెన్ కాకపోవడంతో ప్రభుత్వం ఇచ్చిన గడువు అయిపోవడంతో స్వయం ఉపాధి పెట్టుకోవాలనుకున్న బీసీ నిరుద్యోగ యువత దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ప్రకాశం జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం బీసీ నిరుద్యోగ యువతను తప్పు దోవ పట్టించిందని ఆయన అన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వము ఈ విషయంపై స్పందించి రాష్ట్ర ప్రభుత్వం బిసి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని ఆయన కోరారు...
-----------------------
Admin