సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా నారాయణ పేట జిల్లా, మక్తల్ పట్టణ కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు తెలంగాణ రన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి జండా ఊపి ప్రారంభించారు. ఇట్టి తెలంగాణ రన్ కార్యక్రమంలో జిల్లా జడ్పి చైర్మన్ వనజ ఆంజనేయులు గౌడ్, డిఎస్పి సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి మరియు యువకులు, చిన్నారులతో కలిసి పట్టణ పుర వీధులగుండా అంబేద్కర్ చౌరస్తా వరకు పరుగులు తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెంరాంమోహన్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ వచ్చాక పోలీస్ శాఖలో తమకంటూ ఒక గౌరవం, హోదా లభించిందని అన్నారు. విధి నిర్వహణలో స్వేచ్ఛ ఉందని, అసాంఘిక శక్తులను అణిచివేయడంలో ప్రభుత్వ సహకారం గొప్పదని అన్నారు. ధశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ సురక్ష దినోత్సవం తో పాటు తెలంగాణ రన్ కార్యక్రమం కూడా చేయడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. పోలీస్ శాఖలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్తుల ఆట కట్టిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న వివిధ మండలాల , గ్రామాల ప్రజాప్రతినిధులు, ఎస్ఐ లు పర్వతాలు , నరేందర్ , పీఈటీ లు, కో ఆప్షన్ మెంబర్లు, మున్సిపల్ సిబ్బంది, మరియు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, యువనాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin