సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : రాచకొండ కమీషనరేట్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక కార్యక్రమైన మార్గదర్శక్ లుగా శిక్షణ పొంది పోలీసులకు సహాయపడుతూ అటు ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపడుతూ పోలీస్ వ్యవస్థకు, ప్రజలకు వారధిగా ఉంటు సేవలందిస్తున్న మార్గ్ దర్శక్ లో ఉత్తమ మార్గదర్శన్ గా 2022-23 అవార్డుకు హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అస్త్ర అద్యాపకురాలుగా, ఎన్ఎస్ఎస్ మహిళ అధికారిగా డాక్టర్ జహీదా బేగం విధులు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సంక్షేమంలో తెలంగాణ యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఆకాశంలో సగం కాదు.. ఆమె ఆకాశం అని.. సంక్షేమంలో సగం కాదు.. ఆమె అగ్రభాగం అని వ్యాఖ్యానించారు. దశావతా ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తున్నారు. కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేవలం పథకం కాదు ఒక విస్తవం అని తెలిపారు తల్లిదండ్రుల భారాన్నిదించే భరోసా అని పేర్కొన్నారు. పదిలక్షలకుపైగా ఆడబిడ్డల పెండ్లిళ్ళు చేసిన మేనమామ సీఎం కేసీఆర్ అని కొనియాడారు. గుక్కెడు మంచినీళ్ల కోసం మైళ్లదూరం నడిచిన మహిళల కష్టాలను మిషన్ భగీరథతో శాస్వితంగా తీర్చిన విజనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. మన అంగన్వాడీలను మాచర్ల కార్యకర్తలు వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించారు. దేశంలో అత్యధిక పారిపోషకాలు ఇచ్చి గౌరవప్రదంగా జీవించే అవకాశం కల్పించారన్నారు. ఆడబిడ్డల సంక్షేమంలో మనకు ఎదురు లేదని మహిళా సాధికారికల్లో తెలంగాణ తిరుగులేదని వ్యాఖ్యానించారు.
-----------------------
Admin