సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మేళ్లచెరువు మండలం కందిబండ గ్రామంలో ఆరోగ్య పరిస్థితి బాగాలేక మరణించిన గోపయ్య మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి, వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పిల్లుట్ల రఘు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల కాలం నుంచి ఆలుపెరుగుని ప్రజా సేవ లక్ష్యంగా పనిచేస్తున్న తనని ప్రజలు ఆదరించాలని, ఎన్నికల్లో మన ఓట్లతో గెలిచిన నాయకులు మనల్ని, మన బాధల్ని పట్టించుకోని పరిస్థితి ఏర్పడిందని అని అన్నారు. వారు అధికారం వరకే పరిమితమయి ధనార్జన ద్యేయంగా పనిచేస్తున్నారని పిల్లుట్ల రఘు రానున్న ఎలక్షన్లలో ప్రజలందరూ ఆలోచించి నిర్ణయం తీసుకొని సింహం గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే గెలుపుకు సహకరించాలని పిల్లుట్ల రఘు అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ఏ ఐ ఎఫ్ బి పార్టీ సింహం గుర్తు కార్యకర్తలు, మహిళలు, రఘు అన్న అభిమానులు, ఓజో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin