సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్, ఫారూఖ్ నగర్ మండల్ / తెలంగాణ ప్రభుత్వ హయాంలో షాద్ నగర్ నియోజకవర్గంలో పేద ప్రజలకు, అన్ని వర్గాలకు మంచినీరు అందించేందుకు కోట్లాది రూపాయల ఖర్చు చేసి నీళ్లు అందించామని, పాలనలో చరిత్ర సృష్టించామని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూఖ్ నగర్ మండలం కమ్మదనం గ్రామ పరిధిలో ఉన్న మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం వద్ద తెలంగాణ మంచినీళ్ల పండగ కార్యక్రమాన్ని అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. ఆయా గ్రామాల స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా.. రూ. 433.70 కోట్ల నిధులతో మిషన్ భగీరథ పథకానికి వ్యయం చేశామని ఆన్నారు. షాద్ నగర్ నియోజక వర్గంలో 79, 527 ఇండ్లకు నల్ల కనెక్షన్లు, 321 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణంతో కమ్మదనం మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏర్పాటు చేశామని అన్నారు. మిషన్ భగీరథ పథకం గురించి ఎమ్మెల్యే అంజయ్య సవివరంగా వివరిస్తూ.. నియోజవర్గంలోని 6 మండలాల్లో 68,027 ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని 298 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు నిర్మించడం జరిగిందని దీనికి వ్యయం 110.64 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. షాద్ నగర్ మున్సిపాలిటీలో 11,500 నల్లా కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని 7 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు నిర్మించడం జరిగిందని అన్నారు. కమ్మదనం నీటి శుద్ధి కేంద్రం 260 కోట్లతో నిర్మించడం జరిగిందనీ, 16 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు నిర్మించడం జరిగిందని తెలిపారు. మంచినీటి కోసం నియోజకవర్గ మొత్తంలో 433.70 కోట్ల రూపాయల నిధులు చరిత్రలో నిలిచిపోయే విధంగా పనులు చేపట్టామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
-----------------------
Admin