సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండలం సర్వారం గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి వచ్చే నాగార్జున సాగర్ కాలువ మేజర్ కెనాల్ అప్పన్నపేట క్రషర్ మిల్లు దగ్గర సత్యసాయి వే బ్రిడ్జి పక్కనే ఉన్న లక్ష్మీపురం మేజర్ కెనాల్ కాలువ కు సర్వారం గ్రామానికి చెందినటువంటి కొందరు ప్రజాప్రతినిధులు ఇట్టి కాలువకు గండి పెట్టి నీటిని ఇంటికి తీసుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి విషయమై రైతులు తెలిపిన వివరాల ప్రకారం సర్వారం గ్రామానికి చెందిన అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ బారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కొంతమంది రైతుల అండదండలతో ఇట్టి కెనాల్ కాలువకు గండి కొట్టి క్రింది చెరువులకు నీరు అందకుండా ఇలా గండి కొట్టడంపై తీవ్రమైన ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఇట్టి విషయమై కాలువకు గండి కొట్టిన స్థానిక ఎంపీటీసీ బారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇట్టి ఎన్ఎస్పి కాలువ జేఈ అయినటువంటి కురుమయ్యను కొంతమంది రైతులు ఫోన్ చేసి వివరణ కోరగా రైతుల ఫిర్యాదు పై ఎన్.ఎస్.పి కెనాల్ జే ఈ కురుమయ్య నుండి ఎటువంటి స్పందన లేదని ఈ విధంగా ఏకపక్షంగా జే ఈ కుర్మయ్య వ్యవహరిస్తున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి రైతుల నీటి విషయంపై కాలువలకు గండ్లు పెడుతున్న ఇట్టి సంఘటనపై స్థానిక ఎన్ఎస్పి కాలువ అధికారులు కింది రైతులకు నీరు అందే విధంగా తగు చర్యలు గైకొంటూ క్రింద ఉన్న చెరువులకు నీటిని అందించే దిశగా ఎన్ఎస్పి అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు.
-----------------------
Admin