సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి లో గల నలంద హై స్కూల్ పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని, అట్టహాసంగా ఆనంద ఉత్సవాల మధ్యలో 9 వ తరగతి విద్యార్థిని, విద్యార్థులు 10వ తరగతి విద్యార్థిని, విద్యార్థులు జరుపుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థులు తమ బాల్యాన్ని నలంద హై స్కూల్ తో ఉన్న అనుబంధాలను వెలిబుచ్చారు. ప్రతి ఒక్క విద్యార్థి వారి మనోభావాలను ఉపాధ్యాయులతో గోల రిలేషన్ ని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో వారి ఫ్యూచర్ అంబిషన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం ప్రస్తుత పదవ తరగతి విద్యార్థులకు మరో 20 రోజుల్లో పబ్లిక్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో అందరూ ఇష్టపడి చదవాలని తెలిపారు. ప్రిన్సిపాల్ సాగర్ మాట్లాడుతూ పదో తరగతి స్కూల్ లైఫ్ కి ముగింపు కానీ భవిష్యత్తుకి పునాది అని తెలిపారు. కరస్పాండెంట్ ప్రసాద్ మాట్లాడుతూ హార్డ్ వర్క్ గురించి తన సొంత అనుభవాలను విద్యార్థులకు తెలియజేస్తూ ఆధునిక కాలంలో ప్రతి విద్యార్థి మాథ్స్ సైన్స్ సబ్జెక్టులపై అవగాహన కలిగి ఉండాలని. తమ విద్యార్థుల నుండి ఒక సైంటిస్ట్ ని చూడాలని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయ బృందం మరియు ఉపాధ్యాయేతర బృందం పాల్గొని విజయవంతం చేశారు.
-----------------------
Admin