సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఎం.పి.ఎఫ్.సి ( మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ ) గోడౌన్ లకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయడం జరిగిందని రాష్ట్ర సహకార శాఖ కమీషనర్ అహ్మద్ బాబుకి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ వివరించారు. గురువారం విజయవాడ నుంచి ఎం.పి.ఎఫ్.సి గోడౌన్ లకు భూసేకరణ, నిర్మాణం, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్ లకు భూసేకరణ, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్ లు, జాయింట్ కలెక్టర్ లతో రాష్ట్ర సహకార శాఖ కమీషనర్ అహ్మద్ బాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, డిఆర్ఓ కొండయ్య, పశుసంవర్ధక శాఖ జెడి సుబ్రమణ్యం, మార్కెటింగ్ ఏడి మూర్తి, మార్కెటింగ్ డిఈ రఘునాథ్, పంచాయతీ రాజ్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, పట్టు పరిశ్రమ శాఖ జెడి పద్మమ్మ, పశుసంవర్ధక శాఖ డాక్టర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎం.పి.ఎఫ్.సి గోడౌన్ లకు సంబంధించి జిల్లాలో 3వ విడత కింద 22 గోడౌన్ లు మంజూరయ్యాయని, వాటికి సంబంధించి భూసేకరణ పూర్తి చేసి సంబంధిత స్థలాన్ని అప్పగించడం జరిగిందని తెలిపారు. ఇందుకు సంబంధించి రెండు రోజుల్లోగా వివరాలను ఆన్లైన్ లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో మొదటి, రెండవ మంజూరైన ఎం.పి.ఎఫ్.సి గోడౌన్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ (బిఎంసియు), ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్ (ఏఎంసియు)లకు సంబంధించి ప్రాధాన్యత క్రమంలో భవన నిర్మాణాలు సకళలంలో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
-----------------------
Admin