సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరిష్ రావు అంకెల గారడీ, మాయ మాటలతో మేడి పండు మాధిరిగా రంగుల ప్రపంచంలాగా మెఘా బడ్జెట్ గా చూపించారు. రాష్ర్ట ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. ప్రజలను మభ్య పెట్టడం.. మోసం చేయడానికి అంకెలు పెంచి బడ్జెట్ పెడుతున్నారని గతంలో అనేక మార్లు చెప్పిందే ఇప్పడు నిజమైంది . బడ్జెట్ ను సంపూర్ణంగా అమలు చేయాలన్న చిత్త శుద్ది ఈ ప్రభుత్వానికి ఉంటే వాస్తవిక బడ్జెట్ ను పెట్టే వారు. రాష్ట్ర బడ్జెట్ లో డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇంటి స్థలాల గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. వ్యవసాయానికి 24గంటల పాటు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్న బిఆర్ఎస్ ప్రభుత్వం కనీసం 5గంటలు కూడ నాణ్యతగా ఇవ్వడంలేదని రైతులు ఆందోలన చెందుతున్నారు. రాష్ట్రంలో 50శాతం జనాభా కలిగిన బిసిలకు బడ్జెట్లో కేవలం 6229 కోట్లు మాత్రమే కేటాయించారు. దీనిని బట్టీ బిసిలు అంటే ఈ ప్రభుత్వానికి ఎంత చిన్న చూపో తెలుస్తున్నది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను గత 8 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తున్నది. ఈ సారి కూడ అదే విధంగా చేసినది. ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని చెప్పిన పాలకులు ఈ బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం విచారకరం. రాష్ట్ర ప్రభుత్వం ఏక కాలంలో రుణ మాఫీ అమలు చేయకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 16లక్షల మంది రైతులు బ్యాంకులల్లో ఢిఫాలర్టుర్లుగా మారారు. *నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి గురించి బడ్జెట్ లో మాటే ఎత్తలేదు. బిసి యాక్షన్ ప్లాన్ ను విస్మరించారు* 2014 నుంచి 2022-23 వరకు మాత్రం లిక్కర్ ఆదాయం మాత్రం పెంచుకుంటున్నారు. నీళ్లు, నిధులు, నియమకాలు, ఆత్మగౌరవం కొరకు తెచ్చుకున్న తెలంగాణలో వీటికి తగ్గట్టగా బడ్జెట్ లో నిధుల కేటాయింపు జరుగలేదు. రెసిడెన్షియల్ పాఠశాలలు పెంచామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా తరగతి గదులు, విశ్రాంతి గదులను ఏర్పాటు చేయలేదు.
-----------------------
Admin