సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి తమ భూమికి కొలతలు వేసి హద్దులు చూపమంటే రెవెన్యులోని మండల స్థాయి అధికారుల నుంచి స్పందన కరువైందని శ్రీసత్యసాయి జిల్లా చెన్నెకొత్తపల్లికి చెందిన శోభారాణి, శాంతిప్రియ అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్ కి వచ్చిన వారు తమ భూమికి కొలతలు చూపమని ఆవేదన తెలియజేసారు. చెన్నేకొత్తపల్లికి చెందిన లేట్ కృష్ణమూర్తి w/o కమలమ్మకు ముగ్గురు కుమార్తెలు. కృష్ణమూర్తి వాళ్ళ నాన్నకి 1954లో ప్రభుత్వం 2ఎకరాలకి D-పట్టా మంజూరు చేసి NOC సైతం మంజూరు చేసారు . కృష్ణమూర్తి అనారోగ్యంతో...25 ఏళ్ళ క్రితం మరణించారు. . అందరు మహిళలు కావటంతో ఆర్థిక ఇబ్బందుల వాళ్ళ ఒక ఎకరా భూమిని అమ్ముకున్నారు. మిగతా ఒక ఎకరం భూమి ఉండవలసిన చోట ఇప్పుడు 20 సెంట్ల భూమిని చూపుతున్నారని అన్నారు. చెన్నేకొత్తపల్లిలోని సర్వే నెంబర్ 100 - 101 లో తమ తాతల ఆస్తి ఐన భూమిని కొలతలు వేసి హద్దులు చూపమని స్థానిక రెవెన్యు కార్యాలయంలోని మండల సర్వేరుకి చలానా కట్టినా ...తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని కన్నీరు పెట్టుకున్నారు. కలెక్టర్ గారు ఇప్పటికైనా స్పందించి మహిలలైన తమకు న్యాయం జరిగేల చూడమని వేడుకొన్నారు ..
-----------------------
Admin