సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : పేదలకు నాణ్యమైన వైద్యంను మరింత చేరువ చేసేందుకే బస్తీలలో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరం 37వ డివిజన్ పాత మున్సిపల్ కార్పొరేషన్ భవనంలో రూ. 4. 98 లక్షలతో ఏర్పాట చేసిన బస్తీ దవాఖానను మంత్రి పువ్వాడ ప్రారంబించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. పేద, మద్యతరగతి కుటుంభాలకు వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు రాష్టప్రభ్తుత్వం బస్తీ దవఖానాలను ఏర్పాటు చేస్తుందని, ప్రజలందరు సద్వినియోగం చేసుకుకోవాలన్నారు. వైద్యం కోసం పేద ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్ళకుండా బస్తీలలో దవఖానాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. బస్తీ దవఖానాల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ప్రస్తుతం చిన్న, చిన్న అనారోగ్య సమస్యలకు కూడా పైవేటు ఆసుపత్రులలో వేలాదిరూపాయల ఖర్చు అవుతుందన్నారు. ఇంతకు ముందు ఏ ప్రభుత్వం కూడా పేదల ఆరోగ్యం కోసం ఆలోచించలేదని బి ఆర్ ఎస్ ప్రభత్వం పేదల ఆరోగ్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని గుర్తుచేశారు. కార్పోరేట్ వైద్యాన్ని పేదలకు అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందని ఆయన అన్నారు ....
-----------------------
Admin