సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం బూర్గుల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్సీ బండ ప్రకాష్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడని సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమని, దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీలో కొత్త పాత అని తేడా లేకుండా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారు: చిన్నయ్యగారి ఎల్లయ్య, బ్యాగరి రవీందర్, రమేష్, జంగయ్య, నర్సింలు, మల్లయ్య, రామయ్య, రమణ, పోలె జంగయ్య, రాజ్ కుమార్, బాలయ్య, వెంకటయ్య, పొచయ్య, జగన్, శ్రీను, యాదగిరి, రాజేందర్, అంజయ్య, సాయిలు, శవుకు శ్రీను, శ్రీనివాస్, బోడ రమేష్, గణేష్, లింగారం రవీందర్ గౌడ్ తదితరులు..
-----------------------
Admin