Thursday, 30 July 2026 10:36:19 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు ఇంటి స్థలాలు ఇవ్వాలి... -రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి

Date : 17 June 2023 07:13 AM Views : 343

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీడియా రంగంలో కొనసాగుతున్న వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇవ్వాలని,అన్ని జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టుల ఆత్మగౌరవ భవన్ లు నిర్మించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ (టీఎస్ జే ఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ప్రభుత్వాన్ని కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు జర్నలిస్టుల సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఇచ్చిన హామీలన్నీ ఇంతకాలం నెరవేర్చకపోవడం బాధాకరమైన విషయం అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులుగా నడుస్తూ ఎలాంటి వేతనాలు లేకుండా ఇదే వృత్తిని నమ్ముకొని ఎంతో కాలంగా కొనసాగుతున్న జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నూటికి 80% ప్రాంతాలలో సొంత ప్రెస్ క్లబ్లు లేక జర్నలిస్టులు టీ హోటల్లో చెట్ల కింద ప్రైవేటు భవనాల కింద కాలం గడపాల్సిన దుస్థితి దాపురించిందని గుర్తు చేశారు. జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ప్రెస్ క్లబ్బులు నిర్మించాలని కోరారు.అన్ని ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యే విధంగా ప్రతి జర్నలిస్టు కుటుంబానికి హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఇంకా మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాల కు ఆర్థిక సహాయం పెంచాలఅన్నారు. జర్నలిస్టుగా కొనసాగుతున్న వారికి పోలీసుల నుండి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీస్ భరోసా కార్డులు ప్రత్యేకంగా ఇవ్వాలని యాదగిరి ప్రభుత్వాన్ని కోరారు.రాబోయే ఎన్నికలలోపే ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని యూనియన్లను కలుపుకొని రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని తాము ఉద్యమాలు చేపడతామని చెప్పారు.అనంతరం అసోసియేషన్ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు.రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌస్ రాష్ట్ర గౌరవ సలహాదారులు మానుకొండ రాము రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘువరన్ ఆచార్యులు రాష్ట్ర ప్రచార కార్యదర్శి గట్టిగుండ్ల రాము ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చిలుకల చిరంజీవి జిల్లా గౌరవ అధ్యక్షుడు బరిగల విజయకుమార్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామచంద్రరాజు సూర్యాపేట పట్టణ కోశాధికారి తిరుపతి శ్రీనివాస్ సూర్యాపేట మండలం ప్రధాన కార్యదర్శి కాటం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :