Wednesday, 29 July 2026 11:13:19 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చివ్వెంల మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం...

Date : 30 January 2024 05:16 PM Views : 243

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గ్రామాలలో గతంలో ఎన్నడూ జరుగని అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలో జరిగిందని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని చివ్వెంల మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశానికి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా గ్రామాలలో శాశ్వతంగా గుర్తుండేలా జరిగిన అభివృద్ధిలో ప్రజాప్రతినిధుల పనితీరు అమోఘం అనీ కొనియాడారు.దేశంలో ఏ అవార్డు ప్రకటించిన తెలంగాణకు వరించిన అవార్డులే దీనికి నిదర్శనం అన్నారు. ఎన్ని అవార్డులు ప్రకటించినా మొత్తానికి మొత్తం తెలంగాణనే ఆక్రమిస్తుండడంతో దేశాన్ని జోన్లుగా విభజించేలా కేంద్ర ప్రభుత్వం పాలసీనే మార్పు చేసే విధంగా స్థానిక ప్రజాప్రతినిధుల పనితీరు ఉందన్నారు. అభివృద్ధిలో తెలంగాణ గ్రామాలకు ఇక్కడి పట్టణాలే పోటీ అన్నారు. పట్టణాలతో పోటీపడేలా గ్రామాల అభివృద్ధి జరిగిందన్నారు.పచ్చదనాన్ని పెంపొందించడంలో స్థానిక ప్రజాప్రతినిధుల కృషి ఎనలేనిదన్న ఆయన ప్రభుత్వం ఉద్యమంలా కొనసాగించిన హరితహారం కారణంగా మూడు శాతం ఉన్న అడవులు ఏడు శాతానికి పెరిగాయి అన్నారు. దీనిలో స్థానిక నాయకత్వాన్నిదే ప్రధాన భూమిక అన్నారు. సేవ చేసే వారిని ప్రజలు వదులుకోవడానికి సిద్ధంగా ఉండరన్న జగదీష్ రెడ్డి, ప్రజల ఆశీస్సులతో మరోసారి ప్రజాప్రతినిధులుగా సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం మరో రెండు రోజుల్లో పదవీకాలం పూర్తి అవుతున్న సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్ లను జగదీష్ రెడ్డి సన్మానించారు. ఎంపీపీ ధరావత్ కుమారి బాబు నాయక్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి , జడ్పిటిసి సంజీవ నాయక్,వైస్ ఎంపిపి జీవన్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ సుధీర్ రావు,ఎంపీడీవో లక్ష్మి, ఎంపీఓ గోపి, ఎంపీటీసీలు, సర్పంచ్ లు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :