సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల హుజూర్ నగర్ నందు గత ఆరు రోజుల నుండి నిర్వహిస్తున్న ఎఫ్ ఎల్ ఎన్ శిక్షణ సమావేశం నిర్వహించబడుతున్నది. చివరి రోజు అయిన సమావేశానికి మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి తరగతిలో ప్రతి విద్యార్థి ప్రతి విషయానికి సంబంధించిన అభ్యసన సామర్ధ్యాలను సాధించేటట్లు ఉపాధ్యాయుల కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఎఫ్ ఎల్ ఎన్ నోడల్ అధికారి బీరెల్లి శ్రీనివాసరెడ్డి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు నలబోలు శ్రీనివాసరెడ్డి ,ఈ కోటిరెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లెల ఉదయశ్రీ డిఆర్పి శ్రీనివాస్ ఆర్పీలు చేపూరి నరసింహారావు జక్కుల జయరాం సురేష్ దేవుడు సీఆర్పీలు సైదులు రమేష్ బ్రహ్మం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
-----------------------
Admin