సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు బుధవారం రోజున వరంగల్ జిల్లా అధ్యక్షులు దండ నరేష్ ఆధ్వర్యంలో దుగ్గొండి మండల ఉప సర్పంచుల ఫోరం లో జరిగిన ఎన్నికల్లో దుగ్గొండి మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా గుడ్డేలుగులపల్లె గ్రామానికి చెందిన తొర్రూరు రవి పటేల్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది ఎన్నిక అనంతరం జిల్లా అధ్యక్షులు దండ నరేష్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దు పై వస్తున్న వార్తలను ఖండించి వాస్తవాలను తెలియపరచాలని కోరుకున్నారు. అదేవిధంగా ఉప సర్పంచుల హక్కులను కాపాడాలని మాట్లాడారు అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ఉపసర్పంచులు పాల్గొన్నారు. దుగ్గొండి ఉపసర్పంచుల పోరం మండల అధ్యక్షుడు తొర్రూర్ రవి పటేల్ మాట్లాడుతూ నాకిచ్చిన పదవికి కట్టుబడుతూ అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఇచ్చిన పదవిని సద్వినియోగం చేసుకుంటానని ఎల్లవేళలా ప్రతి ఒక్క ఉప సర్పంచ్ల కు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు దుగ్గొండి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా దేశాయిపల్లి అసోలా సురేష్, ప్రధాన కార్యదర్శి గా పీజీ తండా నునావత్ రమేష్ నాయక్, అధికార ప్రతినిధి గా స్వామిరావు పల్లె కాత్రబాజీ రాధిక, ఉపాధ్యక్షులుగా రాజ్య తండ, భూసారి రామారావు శివాజీ నగర్, కోశాధికారిగా రేబల్లె చెల్పూరి రాజు, సహాయ కార్యదర్శి గా ముద్దునూరు మోటపోతుల శైలజ, కార్యదర్శిగా తొగరంపల్లె పల్లె వైష్ణవి, కార్యదర్శిగా లక్ష్మీపురం అంబిరి మహేష్, కార్యదర్శి తిమ్మంపేట అనుమాండ్ల దిలీప్ రెడ్డి, ఈ కార్యక్రమంలో తదితరుల ఉపసర్పంచ్ లు పాల్గొన్నారు.
-----------------------
Reporter