Wednesday, 29 July 2026 06:25:10 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఘనంగా ఛత్రపతి సాహు మహరాజ్ జయంతి వేడుకలు...

Date : 27 June 2023 01:50 AM Views : 502

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : సామాజికన్యాయం అమలుకు 28 ఏళ్ల వయస్సులోనే తన రాజ్యంలో బ్రాహ్మణేతరులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి,సమాన అవకాశాలకు పునాదులు వేసిన మహనీయులు ఛత్రపతి సాహుమహరాజ్ జయంతిని పురస్కరించుకుని పార్టీ కార్యాలయం వద్ద బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ సాహు మహరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహు మహరాజ్ విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి విద్యాసంస్కరణల కమిటీ ఏర్పాటు చేసి,1917లోనే ఉచిత నిర్భంధ విద్య అమలు చేశారని గుర్తుచేశారు.అంతేకాకుండా తన రాజ్యంలో కులాంతర,మతాంతర వివాహాల చట్టం తీసుకువచ్చి ప్రజాస్వామ్య విలువలకు పునాదులు వేశారని,హిందూ పిల్లల జోగిని వ్యవస్థను నిరోధించే చట్టం తెచ్చి,వివక్ష అంటరానితనం నిషేధించి కొల్హాపూర్ సంస్థానాన్ని ఎన్నో మిగతా రాజ్యాలకంటే అధునాతన,ఆధునిక భావాలతో అభివృద్ధి పథంలో నడిపారని కొనియాడారు.అదేవిధంగా అంటరానికులాలకు చెందిన ప్రజలకు చదువు రాకపోయినా,సైన్యంలో చేరే అవకాశాలను కల్పించి సమానత్వాన్ని చాటి చెప్పారని,అందుకే బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షీరాం ఈ మహనీయున్ని పార్టీ సిద్దాంతకర్తగా పేర్కొన్నారని తెలిపారు.ఛత్రపతి సాహు మహరాజ్ స్పూర్తితో బీసీలకు చట్ట సభల్లో 60 నుండి 70 సీట్ల వరకు ప్రాతినిధ్యం కల్పించబోయే పార్టీ కేవలం బీఎస్పీ మాత్రమే అన్నారు.బహుజన్ సమాజ్ పార్టీ పాలనలోనే ఛత్రపతి సాహు మహరాజ్ ఆశయాలను నెరవేరుస్తూ,భారతరాజ్యాంగ విలువలు కాపాడబడుతాయన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,జిల్లా కార్యదర్శులు చెనిగారపు నిరంజన్ కుమార్,మాలోత్ వీరు నాయక్,మాలోత్ పూర్ణ చందర్,వంగా రవిశంకర్,సందేల సందీప్ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :