సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : నాడు దొరల గడీలను బద్దలు కొట్టి దుర్మార్గుల అంతు చూసిన వీరనారీమణి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో నేడు రాష్ట్రాన్ని ఏలుతున్న కేసీఆర్ దొరకు, ఆయన నిరంకుశ పాలనకు జై కొడుతున్న దొర అనుచర మంత్రులకు, ఎమ్మెల్యే లకు రాబోయే ఎన్నికల్లో ఓట్ల ద్వారా బుద్ది చెప్పాలని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పిలుపునిచ్చారు. పెత్తందారుల పీడను విరగడ చేసి ఎంతో ధైర్యశాలిగా నిలిచిన ఐలమ్మ స్ఫూర్తితో ఆమె ఆశయాల సాధనలో నేటి పాలకులను ఎదిరించి తరిమికొడదామని అన్నారు. ప్రభుత్వ పాలనలో అక్రమాలు దౌర్జన్యాలు అవినీతి పెరిగిపోయాయని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ప్రజలను దోచుకు తింటున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి పట్టిన పీడను విముక్తి చేసేందుకు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారని ప్రభుత్వ పాలకులను హెచ్చరించారు.
-----------------------
Admin