సర్కార్ టీవీ న్యూస్ / నంద్యాల జిల్లా : నందికొట్కూర్ పట్టణంలోని జగనన్న కాలనీ నాటు సారాకు మరో అడ్డగా మారిం దాన్న పక్క సమాచారంతో నందికొట్కూరు అర్బన్ పోలీస్ సిబ్బందితో కలిసి హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాయుడు 500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ గ్రామాలలో యువత నాటుసారా కు బానిసలై ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకు మూల కారణం నాటు సారె ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నాటు సారా పై ఉక్కు పాదం మోపినట్లు పోలిసులు తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని నీలి షికారి పేట కు చెందిన వ్యక్తి జగనన్న కాలనీలో ఇల్లు కొనుగోలు చేసి ఇంటిపైన తయారీ కేంద్రంలోని సారా ఊట ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఈ దాడుల్లో అర్బన్ పోలీస్ సిబ్బంది, నాగరాజు యాదవ్ ఓంకారు, వేల్పులవెంకటేశ్వర్లు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin