సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం గులాబీ పండుగకు సిద్ధమైంది. బీఆర్ఎస్ తరువాత మొట్టమొదటగా ఖమ్మంలో జరిగే సభకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. కనీవిని ఎరుగని రీతిలో ఔరా అనేలా ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. యావత్ దేశం దృష్టి ఖమ్మం సభపై ఉండేలా చేస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మంలో ఎక్కడ చూసినా గులాబీ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఖమ్మం నగరానికి చుట్టుపక్కల ఉన్న ప్రధాన రహదారులన్నింటినీ భారీ ప్లెక్సీలతో అలంకరించారు. ఈ ఫ్లెక్సీలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు అరవింద్ కేజీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఫొటోలతో ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల ఏర్పాటుతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తున్నది...
-----------------------
Admin