సర్కార్ టీవీ న్యూస్ / ఢిల్లీ : లోక్ సభలో న్యాయవాద రక్షణ బిల్లు ప్రవేశ పెట్టే విధంగా కృషి చేసుటకై పలు ఇతర సమస్యలపై B R S లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వరరావుకి ఢిల్లీలో తన నివాసంలో ఖమ్మం న్యాయవాది తాళ్లూరి దిలీప్ చౌదరి ఆధ్వర్యంలో కలిసి న్యాయవాదులు వినతి పత్రం సమర్పించారు... ఇటీవల కాలంలో భారత దేశవ్యాప్తంగా న్యాయవాదులపై క్రూరమైన దాడులు జరుగుతున్నాయని, అన్ని రాష్ట్రాల్లో న్యాయవాదులు తమ భద్రత గురించి న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారు కావున న్యాయవాద రక్షణ చట్టం బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టే విధంగా కృషి చేయవలసిన అవసరం ఎంతో ఉందని, అలాగే 2021 సంవత్సరంలో సెంట్రల్ నోటరీ ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించారు తెలంగాణ సంబంధించిన న్యాయవాదులు సుమారు 2000 మంది దరఖాస్తు చేసుకున్నారు ఇప్పటివరకు వారికి వారి దరఖాస్తులకు ఎలాంటి సమాచారము కూడా తెలియజేయలేదు.. ఇట్టి విషయంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే పరిష్కరించే దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు ఈ వినతి పత్రం అందజేసిన వారిలో ఖమ్మం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు గొల్లపూడి రామారావు, న్యాయవాదులు , తోటకూర శ్రీనివాసరావు, సింగం జనార్దన్ గౌడ్, కొత్తగూడెం యువ న్యాయవాది ఇంతియాజ్, మణుగూరు న్యాయవాది చంద్రకాని గురు కృష్ణ, సుప్రీంకోర్టు న్యాయవాది పుల్లభట్ల శ్రీ చక్రపాణి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు
-----------------------
Admin