Sunday, 01 March 2026 07:59:22 PM
# వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..? # కొమరం భీమ్ 125వ జయంతి ఉత్సవవేడుకలు...

న్యాయవాదుల సమస్యలపై వినతి పత్రం... - తాళ్లూరి దిలీప్ చౌదరి

Date : 27 July 2023 12:45 PM Views : 4257

సర్కార్ టీవీ న్యూస్ / ఢిల్లీ : లోక్ సభలో న్యాయవాద రక్షణ బిల్లు ప్రవేశ పెట్టే విధంగా కృషి చేసుటకై పలు ఇతర సమస్యలపై B R S లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వరరావుకి ఢిల్లీలో తన నివాసంలో ఖమ్మం న్యాయవాది తాళ్లూరి దిలీప్ చౌదరి ఆధ్వర్యంలో కలిసి న్యాయవాదులు వినతి పత్రం సమర్పించారు... ఇటీవల కాలంలో భారత దేశవ్యాప్తంగా న్యాయవాదులపై క్రూరమైన దాడులు జరుగుతున్నాయని, అన్ని రాష్ట్రాల్లో న్యాయవాదులు తమ భద్రత గురించి న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారు కావున న్యాయవాద రక్షణ చట్టం బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టే విధంగా కృషి చేయవలసిన అవసరం ఎంతో ఉందని, అలాగే 2021 సంవత్సరంలో సెంట్రల్ నోటరీ ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించారు తెలంగాణ సంబంధించిన న్యాయవాదులు సుమారు 2000 మంది దరఖాస్తు చేసుకున్నారు ఇప్పటివరకు వారికి వారి దరఖాస్తులకు ఎలాంటి సమాచారము కూడా తెలియజేయలేదు.. ఇట్టి విషయంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే పరిష్కరించే దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు ఈ వినతి పత్రం అందజేసిన వారిలో ఖమ్మం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు గొల్లపూడి రామారావు, న్యాయవాదులు , తోటకూర శ్రీనివాసరావు, సింగం జనార్దన్ గౌడ్, కొత్తగూడెం యువ న్యాయవాది ఇంతియాజ్, మణుగూరు న్యాయవాది చంద్రకాని గురు కృష్ణ, సుప్రీంకోర్టు న్యాయవాది పుల్లభట్ల శ్రీ చక్రపాణి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :