సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఈరోజు ఒకటో తారీకుకనుక టౌన్ హాల్ నందు అధ్యక్షుడు షేక్ సైదా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల అందరూ వెల్ఫేర్ బోర్డు కార్డు తీసుకోవాలని అదేవిధంగా తీసుకున్నవారు ప్రతి నాలుగు సంవత్సరాల లోపల రెన్యువల్ చేయించుకోవాలని అని చేయించుకున్నా వారికే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పొందుతారని చాలా మంది రెన్యువల్ చేయడం తెలియక చేయించుకోగా ఎటువంటి పథకాలు పొందలేకపోతున్నారు కావున ప్రతి ఒక్క కార్మికుడు వారి హెల్పర్ బోర్డు కార్డును పొంది సకాలంలో రెన్యువల్ చేసుకోవాలని తెలియజేశారు .అదేవిధంగా జనవరి 10వ తారీఖున జరిగిన సి ఎస్ సి హెల్త్ కేర్ వారు టౌన్ హాల్లో జరిపిన హెల్త్ కేర్ బ్లడ్ టెస్ట్ గాను భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు షేక్ సైదా వారికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఆరోజు టెస్ట్లు చేయించుకున్న వారందరిని పిలిపించి ప్రతి కార్మికుడికి భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు మరియు కమిటీ సభ్యులు అందరూ కలిసి ఎవరి రిపోర్ట్స్ వారికి ఇవ్వడం జరిగింది . ఇట్టి కార్యక్రమం లో గౌరవ అధ్యక్షులు బంక శ్రీనివాస్ రెడ్డి , మరియు కోశాధికారి ఏలియా ,ప్రధాన కార్యదర్శి వినాయక రావు ,ఉపాధ్యక్షులు మన్యం సైదులు, రాడ్ బెండింగ్ శీను ,కచ్చుపాటి శ్రీను, కర్ర శ్రీను మేస్త్రి పర్వతాలు ,నాగుల్ మీరా,మోయిన్ తదురు పాల్గొన్నారు...
-----------------------
Admin