సర్కార్ టీవీ న్యూస్ / ఆదిలాబాద్ జిల్లా : అదిలాబాద్ నియోజకవర్గ ప్రజల అభిమానంతోనే సేవ చేసే భాగ్యం కలిగిందని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు అన్నారు... వసతి గృహాల్లో విద్యార్థులు పడే ఇబ్బందులను చూసి శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా మాట్లాడే అవకాశం రావడంతో హాస్టల్ విద్యార్థుల కష్టాలను మెస్ చార్జీల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు... దీనికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి బీసీ శాఖ మంత్రి కమిటీలు చర్చించి మెస్ చార్జీల పెంపునకు ఆమోదం తెలపడంతో రాష్ట్ర మొత్తంలో వసతి గృహాల్లో ఉండే 8 లక్షల మంది విద్యార్థులకు మేలు జరిగిందని ఆయన అన్నారు వసతి గృహాలపై నమ్మకంతో అనేకమంది పేదలు తమ పిల్లల్ని మీ చేతిలో పెడతారని మీ పిల్లలాగే వసతి గృహాల్లో ఉండే పిల్లలకు పట్ల శ్రద్ధ పెట్టాలని ఆయన అన్నారు వారు ఉన్నతికి బాటలు వేయాలని ఆయన కోరారు తాను సభ దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారమై ఎంతో మంది పేదలకు మేలు జరగడం తనకెంతో సంతృప్తినిచ్చిందని ఇంతకంటే నాయకులకు కావాల్సిందేముందని ఆయన అన్నారు రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలను ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని ఆయన అన్నారు అధికార ప్రభుత్వం సైతం స్పందించి మెస్ ఛార్జీలు పెంచడం అభినందనీయం అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు మిఠాయిలు తినిపించి వారితో కొద్దిసేపు మాట్లాడారు ఈ కార్యక్రమంలో హాస్టల్ సిబ్బంది బీజేపీ నాయకులు అశోక్ రెడ్డి. ముకుంద్. దయాకర్. తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin