సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు మండలం మేగడం పహాడ్ తండ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మూడు లకపతి నాయక్ ఇటీవల మరణించగాఎంపిపి భూక్యా గోపాల్ నాయక్ శనివారం నాడు జరిగిన పెద్ధకర్మ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు ఐదు వేలు రూపాయలు సహాయం చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా గోపాల్ నాయక్ మాట్లాడారు. లక్పతి కాంగ్రెస్ పార్టీ కి చేసిన సేవలను కొనియాడారు. వారి మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో నాయకులు దనవత్ చత్త, మూడు రామారావు, బిక్షం, రవీందర్,అనిల్,సైధా, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin