సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి : జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల పరిధిలోని ఎర్రగుంట ఉన్నత పాఠశాలలో సైన్స్ ఫెయిర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లాలో వివిధ పాఠశాల నుండి విద్యార్థిని విద్యార్థులు ఈ ప్రదర్శనలో సాంకేతికతను ఉపయోగించి వారు తయారుచేసిన వస్తువులను ప్రదర్శించారు.తొలుత ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.విద్యార్థులకు కేటాయించిన ఆయా స్టాల్స్ లో విద్యార్థులు రకరకాల అద్భుతమైన సాంకేతిక ప్రదర్శనలు ప్రదర్శించారు.అనంతరం మండల విద్యాశాఖ అధికారి,ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విజేతలను ప్రకటించారు.వారికి స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతులమీదుగా బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమాన్నీ తొలి అడుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించటం చాలా స్ఫూర్తిదాయకమని పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు,పెద్దలు అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధికారులు,ఆయా పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు,ఉపాధ్యాయులు, ఆయా పార్టీ నాయకులు,ప్రజలు,గ్రామస్తులు,పాల్గొన్నారు.
-----------------------
Admin