సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : ముసినిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 28 నుంచి నామి నే షన్ల పర్వం ప్రారంభం కాగా మొదటి రెండు రోజుల్లో అ భ్యర్థుల నుంచి ఓ మోస్తరు స్పందన లభించింది. అలాగే ఇతర మునిసి పాలిటీల్లోనూ చివరి రోజున పెద్ద సంఖ్యలో నామి నేషన్లు దాఖలయ్యాయి...వివిధ పార్టీలు, స్వతంత్రులు ఒక్కొక్కరు రెండు మూడు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు నామినేషన్ల దా ఖలు చివరి రోజున కూడా అభ్యర్థులను ఖరారు చేశా యి. దీంతో ఆయా పార్టీల టిక్కెట్లు ఆశిస్తున్న అభ్యర్థు లు పార్టీ పరంగా రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేయగా, ఒ కవేళ అనుకొని పరిస్థితుల్లో పార్టీలు టికెట్ నిరాకరిస్తే బరిలో నిలిచే విధంగా స్వతంత్రులుగా సైతం నామినే షన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ పరంగా బీ ఫాం ఇస్తే అప్పటి వరకు పార్టీ పరంగా వేసిన నామినే షన్ ఉపయోగపడుతుండగా, పార్టీలు నిర్ణయం మా ర్చుకుంటే ఇండిపెండెంట్గా దాఖలు చేసిన నామినే షన్ పనికి వస్తుందనే ఉద్దేశ్యంతో ముందు జాగ్రత్త చ ర్యగా రెండు మూడు సెట్లు దాఖలు చేసినట్లు తెలు స్తోంది... శుక్రవారంతో నామినేషన్ల దాఖలు పర్వం ముగి యగా, ఫిబ్రవరి 3వ తేదీన బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను అధికారులు వెల్లడించనున్నారు....
-----------------------
Admin