సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవరచెరువు మండల కేంద్రంలో నీటి ఎద్దడి తీవ్రమై ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని బీసీ హక్కుల పోరాట సమితి పుట్టపర్తి నియోజకవర్గ అధ్యక్షుడు m.S షబ్బీర్ మండిపడ్డారు. మండల కేంద్రంలోని మరువ బజార్, లో ఖాళీ బిందెలతో మహిళలు అధికారులు, ప్రజాప్రతినిధుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా షబ్బీర్ మాట్లాడుతూ 20 రోజుల కిందట బోరు మోటారు మరమ్మతు చేయిస్తే ఒక్కరోజు మాత్రమే పనిచేసి మళ్లీ మరమ్మతుకు గురైందన్నారు. అప్పటినుంచి నీటి ఎద్దడితో అల్లాడిపోతున్నామని ప్రజలు పలుమార్లు ప్రజాప్రతినిధులు అధికారులు దృష్టికి తీసుకువచ్చిన వారికి చీమకుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేజర్ పంచాయతీలోని పరిస్థితి ఇలా ఉంటే ఇక గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించడంలో ప్రజా ప్రతినిధులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. ఇప్పటికైనా బోరు మోటారు మరమ్మతు చేయించి నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో మహిళలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఎమ్ ఎస్ షబ్బీర్, ఖాజాపీర్, దిల్ షాద్, మాబ్ జాన్, గుల్ జార్, ఓబుళమ్మ,మస్తాణమ్మ, చంద్రమ్మ, మన్సూర్, పార్వతమ్మ, హనీఫా, ప్యారీ, సద్దాం, కరిష్మా శిల్పా, బల్ కిష్, అజంతుల్లా, మాబ్బాషా, శంకరమ్మ, రషీద, తదితరులు....
-----------------------
Admin