సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో విధుల్లో రాణించిన ఐటీ కోర్ బృందాన్ని అభినందిస్తూ తెలంగాణ రాష్ట్ర అదనపు డీజీపీ (టెక్నికల్ సర్వీసెస్) వి.వి. శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అందజేశారు. హైదరాబాద్ డీజిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సి.సి.టి.ఎన్.ఎస్ విధుల్లో రాణించిన ఐటీ కోర్ సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా ఐటీ కోర్ కానిస్టేబుళ్ళు హెడ్ కానిస్టేబుల్ రాజేందర్, కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్, నర్సయ్య, రమేష్ తో పాటు హసన్ పర్తి కానిస్టేబుల్ సోమన్న, దుగ్గొండి కానిస్టేబుల్ రాకేష్, ఘన్పూర్ కానిస్టేబుల్ రాఘవేందర్ లను అదనపు డిజిపి అభినందించి ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా ప్రశంస పత్రాలను అందుకున్న ఐటీ కోర్ సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందిస్తూ అప్పగించిన విధులను విజయవంతం పూర్తి చేయడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించబడుతాయని, అలాగే విధుల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి అధికారుల గుర్తింపుతో పాటు, శాఖపరమైన గుర్తింపు వుంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.
-----------------------
Reporter