సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం తేదీ 05.12.2023. నా ముంచుకొస్తున్న మిచౌoగ్ తుఫాను-ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు చాలా నష్టపోతున్నారు రైతులు కోసిన ధాన్యం నీ తడవకుండా పరదాలతో కప్పుకొని తగు జాగ్రత్తలు తీసుకొవాలని ఎస్సై షాహీన సూచించారు.... తుఫాన్ దృశ్య గ్రామీణ ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్ళరాదు. శిధిలావస్థలో ఉన్న భవనాల ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండండి. మిచౌoగ్ తుఫాన్ కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటికే ఉన్నత అధికారులు రెడ్ అలర్ట్ ను ప్రకటించారు. అన్నపురెడ్డిపల్లి మండలంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ తుఫాన్ సృష్టించే బీభత్సం నుండి తమకు తాము రక్షించుకోవడంతో పాటు పోలీసు వారికి సహకరించాలి. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలు, రైతులు పొలాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలి. చేపల వేటకు వెళ్ళరాదు... శిథిలవ్యవస్థలో ఉన్న భవనాలు తుఫాన్ కారణంగా కూలే ప్రమాదం ఉంది కావున ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజలు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళవలెను. ప్రజలు అత్యవసర అయితే తప్ప ఇంట్లో నుంచి బయటికి రాకూడదు అని తెలియజేశారు.... అత్యవసర సహాయానికి 100 కి డయల్ చేసి పోలీస్ సహాయం పొందగలరు మా పోలీస్ వ్యవస్థ నుండి మండల ప్రజలకు తగిన సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాం అని ఎస్ఐ షాహినా తెలిపారు....
-----------------------
Admin